35.2 C
Hyderabad
May 1, 2024 00: 17 AM
Slider ఖమ్మం

పొంగులేటీ…. తప్పుడు ప్రచారం మానుకో

#ponguleti

ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ను నష్టపరచాలని , తన సొంత ఎజెండాతో ముందుకు పోతున్నమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆటలు సాగనివ్వమని ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి చర్యలు ,చేష్టలపై మధు ఫైర్ అయ్యారు.

ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అడ్డగోలుగా మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి చర్యలను పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ ఖండించాలని పిలుపు నిచ్చారు . నోరుందికదా? డబ్బులతో జనం వస్తున్నారు కదా? అని పార్టీ పై పొంగులేటి ఇష్టానుసారం మాట్లాడితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . రైతులకు రుణమాఫీ చేయలేదని , 24 గంటల ఉచిత విద్యత్ అందడంలేదని అబద్దాలు చెప్పడం దారుణమని అన్నారు .నారాయణపురం లోని శ్రీనివాస్ రెడ్డి 40 ఎకరాల మామిడి తోటకు ఉచిత విద్యుత్ అందటం లేదని నిరూపిస్తానంటే మీడియా మిత్రులతో బహిరంగ చర్చకు వస్తానని , అందుకు ఆయన సిద్దమేనా అని మధు సవాల్ చేశారు . కోట్ల రూపాయలకు అధిపతి వైన నీవు ఒక్కపైసా అయినా కరెంట్ బిల్లు కడుతున్నావా? కరెంటు వస్తుందా? లేదా? అన్న విషయమై నేను కల్లూరు వస్తా.. వెళ్దామా ? నీకు కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు తీసుకుంటున్నావా లేదా ? చెప్పాలని డిమాండ్ చేశారు .

ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగింది . అనేక ఉద్యమాలకు నిలయం . ఇక్కడ ప్రజలు రాజకీయాలను కలుషితం చేస్తే సహించరని గుర్తుంచుకోవాలని అన్నారు. ధన రాజకీయలను ప్రోత్సహిస్తున్న పొంగులేటి కి రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బుద్ధి చెపుతారాన్నారు

Related posts

మతాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

హృదయ రాణి

Satyam NEWS

గొర్రెలకాపరిని కొట్టిచంపిన అగంతకులు

Satyam NEWS

Leave a Comment