ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపాడు. మరిన్ని కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మహేశ్ ట్వీట్ ఇది:”రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం.” మహేశ్ బాబు మంత్రి కేటీఆర్, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.