40.2 C
Hyderabad
May 6, 2024 15: 15 PM
Slider విజయనగరం

మీచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తం గా ఉన్నాం….!

#vijayanagaram

భారీ తుఫానును ఎదుర్కొన‌డానికి   జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంద‌ని,విజయనగరం జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేసి, అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకున్నార‌ని ఆయ‌న వెళ్ల‌డించారు. జెడ్‌పి స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, సిఎం నిరంత‌రం అధికారుల‌తో, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ, తుఫాను ప్ర‌భావాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. తీర‌ప్రాంతంలో హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డ‌మే కాకుండా, ఎటువంటి ప‌రిస్థితి త‌లెత్తినా ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్ ద‌ళాల‌ను సిద్దంగా ఉంచార‌ని తెలిపారు.

వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌ను బ‌ట్టి మిఛాంగ్ తుఫాను ప్ర‌భావం మ‌న జిల్లాపై పెద్ద‌గా ఉండే అవ‌కాశం లేద‌న్నారు. అయితే భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌న్న సూచ‌న‌లు మాత్రం ఉన్నాయ‌ని, కోత‌కొచ్చిన వ‌రిపంట న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉన్నందున‌ రైతులు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని కోరారు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ధాన్యాన్ని ఆఫ్‌లైన్లో అయినా కొనుగోలు చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.

రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జ‌రుగుతోంద‌ని, రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో త‌న‌ను ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా రాసిన వార్త త‌ప్పుడు క‌థ‌న‌మ‌ని, దురుద్దేశంతో కుట్ర పూరితంగా దానిని ప్ర‌చురించార‌ని ఈ సంద‌ర్భంగా జెడ్‌పి ఛైర్మ‌న్  పేర్కొన్నారు.ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసుల నాయుడు, అంబళ్ళ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

Satyam NEWS

హుజుర్ నగర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నిక

Satyam NEWS

అక్రమ రేషన్ బియ్యం పట్టిచ్చినా పట్టించుకోని అధికారులు

Satyam NEWS

Leave a Comment