31.7 C
Hyderabad
May 2, 2024 07: 16 AM
Slider విశాఖపట్నం

గ్రామాల అభివృద్ధికి సాయం అందిస్తాం

#NRI to work for the development

ప్రతి ఎన్నారై రెండు తెలుగు రాష్ట్రాలోని తమ సొంత గ్రామల అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం నాట్స్ (అమెరికా)సేవా సంస్థ ద్వారా గ్రామాల అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి హామీ ఇచ్చారు. ఈరోజు విశాఖ నగరంలోని, పబ్లిక్ లైబ్రరీ మీటింగ్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్ప సాని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి ప్రసంగించారు

. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ నాట్స్ సంస్థ వారిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామీల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ మాకు జన్మనిచ్చిన జన్మభూమి కోసం, తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మా నాట్స్ సంస్థ సభ్యులను కూడా ఈ విషయంలో చైతన్య పరచడం కోసం మే నెలలో జరిగే నాట్స్ సర్వసభ్య సమావేశంలో గ్రామాల అభివృద్ధి పైన ప్రత్యేకంగా ఒక సెమినార్ ను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల గ్రామీల అభివృద్ధి కొరకు ఒక స్టాల్ ని కూడా ఆ సమావేశాల్లో ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశాలకు సర్పంచులను కూడా ఆహ్వానిస్తున్నామని శ్రీధర్ అప్ప సాని ఆహ్వానించారు.

నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయడం సంతోషకరమైన విషయమని, రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి మేరకు తప్పకుండా మా నాట్స్ సేవా సంస్థ ద్వారా గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో మే నెలలో జరిగే మా నాట్స్ సమావేశాల్లో కమిటీ వారందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకొని మా జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా కృషి చేస్తామని బాపయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అప్ప సాని శ్రీధర్ కి, బాపయ్య చౌదరి కి శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి, పూలమాలలు వేసి సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షులు పుసులూరి నరేందర్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వదిలేది లేదు

Satyam NEWS

అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

Satyam NEWS

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment