ఎలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఆగవని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
రైతు బందు, రైతు భీమా పథకాలకు తోడు రాష్ట్రంలో సాగునీటి లభ్యత వల్ల వ్యవసాయరంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పెండెం సుజాత, వైస్ ఎంపిపి గుత్తికొండ ప్రమీల, గరిడేపల్లి సర్పంచ్ సీతారాం రెడ్డి, TRS పార్టీ మండల అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ లు, అధికారులు పాల్గొన్నారు.