35.2 C
Hyderabad
April 27, 2024 15: 00 PM
Slider ముఖ్యంశాలు

ముస్లింలు ఎంగిలి నాక్కోవడం వల్లే కరోనా

Narayana swamy

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాధి ముస్లింలు చేస్తున్న పనుల వల్లే వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్లి వచ్చిన ముస్లింలు ఆ తర్వాత కూడా ఒకళ్లను ఒకళ్లు తాక్కుంటూ తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందిదని ఆయన అన్నారు.

ఒకరి చెంచాలు మరొకరు నాక్కోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ముస్లింల పట్ల తనకు వ్యతిరేకత లేదని అయితే వారు చేసిన పనుల కారణంగానే కోవిడ్ వ్యాప్తి చెందిందని నారాయణ స్వామి అన్నారు. ముస్లింలు ఎంగిలి పూసుకుంటారని ఆయన అన్నారు.

ముస్లింలకు కరోనా పాజిటీవ్ వస్తే ఆ తర్వాత వారు చేసే పనులు భరించలేనివిగా ఉన్నాయని ఆయన అన్నారు. పాజిటీవ్ వచ్చిన ముస్లింలు ఒకరిపై ఒకరు పడుతూ మరింత వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లా దేవుడే, మహిమ గలవాడే గానీ ముస్లింలు ఇలా చేస్తుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు ఈ విషయాలన్నింటిని ఆలోచించాలని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అన్నారు.

Related posts

చదువుకుంటేనే జీవితానికి రాణింపు: ఎంపీ ఆదాల

Bhavani

1948-సత్యమేవ జయతే షూటింగ్ దాదాపుగా పూర్తి

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సన్నాహక కమిటీ సభ్యుడుగా ఆదెర్ల

Satyam NEWS

Leave a Comment