*కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండబోదని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ రెండురోజుల క్రితం ప్రకటించారు. అయితే విద్యాశాఖ దీనికి విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగుల నియామకానికి ఆదేశాలు జారీచేసింది. సమగ్ర శిక్ష విద్యా పథకం కింద వివిధ పోస్టులకు 704 మంది ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఎ. శ్రీదేవసేన డీఈవోలకు ఆర్డర్లు ఇచ్చారు. ఈ జాబి తా ప్రకారం మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 144మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138 మంది, సిస్టం అనలిస్టులు 12 మంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు 383 మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా భర్తీ చేస్తారు.
కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ఉండబోదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఈమేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. ప్రభుత్వ పాలసీయే లేనప్పుడు వీరికి జీతాలు ఎలా ఇస్తారు? ఈ నియామకాలు జరిగితే సీఎం ప్రకటనకు చట్టబద్ధత ఉంటుందా? అధికారులు ఎందుకు ఇలా ఆదేశాలిచ్చారు ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.