తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడింది. ఆయనను అక్కడ నుంచి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించకుండా ప్రస్తుతం అదనపు ఈవోగా ఉన్న ఏ వి ధర్మారెడ్డికి పూర్తి స్థాయి ఈవోగా బాధ్యతలు అప్పగించారు.
అనిల్ కుమార్ సింఘాల్ ను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పలు వివాదాలు రేగుతున్న నేపథ్యలో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ సంచలనం కలిగిస్తున్నది.