40.2 C
Hyderabad
April 26, 2024 14: 11 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

rahulgandhi

వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని ఆయన తన లేఖలో కొరారు. గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయం రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ కోరారు.

Related posts

హైదరాబాద్‌లోబజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్స్ అండ్ లోన్స్ ఫెస్టివల్‌

Satyam NEWS

తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం దిశగా అడుగులు

Satyam NEWS

డాన్స్ వేసిన రాహుల్

Murali Krishna

Leave a Comment