34.2 C
Hyderabad
May 19, 2025 17: 11 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

rahulgandhi

వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని ఆయన తన లేఖలో కొరారు. గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయం రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ కోరారు.

Related posts

పాజిటీవ్ టాక్ తో కల్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్రం

Satyam NEWS

విదేశీ పర్యటన కు శ్రీకారం చుట్టనున్న బీజేపీ నేత రామ్ చందర్…!

mamatha

Analysis: గవర్నర్ వ్యవస్థ బరువు కాదు బాధ్యత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!