*మావోయిస్ట్ నేత మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కైకా, మౌస్లా మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సెండ్రా ఎల్.ఓ.ఎస్ డిప్యూటీ కమాండర్ రితేష్ పూనమ్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆయుధం, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై 3 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు, ఘటనలో ఒక జవాన్కు గాయాలైనట్టు బీజాపూర్ ఎస్పీ కమలేషన్ కశ్యప్ ధృవీకరించారు. ఈ సంఘటనలో పదుల సంఖ్యలో మావోయిస్ట్ లు పాల్గొన్నట్లు పోలీసు లు అంచనా వేస్తున్నారు . ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు.