టీడీపీ కేవలం తన రాజకీయ మనుగడను కాపాడుకునేందుకే ప్రతీ అంశాన్నిరాజకీయం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మె్ల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తాజాగా జంగారెడ్డి గూడెంలో జరిగి కల్తీ నాటు సారా ఘటన పుణ్యమా…టీడీపీ తలపెట్టిన నారీ దీక్షను..వాయిదావేసిందే కాని..అస్సలు ఆ పార్టీ దీక్షలు ఎందుకు చేపడుతుందో…ఆ పార్టీకే తెలియని పరిస్థితి నెలకొని ఉందని ఎమ్మెల్యే కోలగట్ల విమర్శించారు.మద్య పానంపై మీ పార్టీ స్టాండ్ ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఒక వేళ మధ్య నిషేధాన్ని పెట్టమని అడుగుతున్నారా…? లేక ప్రభుత్వ షాపులలో అమ్ముతున్న బ్రాండ్లను మార్చమని అడుగుతున్నారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.ఒక వేళ మధ్య పాన నిషేధాన్నికోరితే…రాష్ట్రంలో ఏబ్రాండ్ అమ్మకూడదని కోరాలి అదీ కాకపోతే.బ్రాండ్ మార్చమంటూ అస్సలు మధ్య పాన విషయం ఎత్తకూడదన్నారు ఈ మేరకు ఏపీలోని విజయనగరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు.దాదాపు ఆరు ప్రశ్నలను సంధించి…అస్సలు టీడీపీ నారీ దీక్ష ఎందుకు చేపడుతుందో చెప్పాలని ఎమ్మెల్యే కోలగట్ల ప్రశ్నించారు.
అస్సలు టీడీపీ ఎన్ని నిరసనలు దీక్షలు చేపట్టినా..చంద్రుడిపై నూలు పోగు లాంటిదేనని ఎమ్మెల్యే కోలగట్ల విమర్శించారు. అస్సుల చంద్రబాబు..రాజకీయలకు స్వస్తి పలకాలని. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు…నేటి రాజకీయాలకు పనికిరానన్నారు.వృద్ద్యాప్యం మీదకు వచ్చిందని..తన రాజకీయ వారసుడిగా…నారా లోకేష్ ను తీసుకువచ్చినా…ఆయన మాత్రం ఒక్క అడుగు రాజకీయంగా వేయలేకపోయారన్నారు.అన్ని రంగాలకు జగన్ ప్రభుత్వం మేలు చేస్తోందని..రాష్ట్ర ప్రజలతో పాటు నియోజకప్రజలంతా..హయిగా ఉంటున్నరాని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. రాష్ట్రంలో అధికారుల పుణ్యమా కొన్ని దురదృష్ట కరమైన ఘటనలు జరగడంతో…దాన్ని రాజకీయ వాడుకుని..తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ యత్నిస్తోందన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా..ఎన్ని డ్రామాలుఆడినా..ఎన్ని పార్టీలను కలుపుకున్నా…వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టడం…ఆయన తరం కాదన్నారు.