33.7 C
Hyderabad
April 30, 2024 00: 21 AM
Slider ముఖ్యంశాలు

ఎన్నికల సమయంలోనే గిరిజనులు గుర్తుకొస్తారా…??

#elections

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరుచేయాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోడు రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోడు రైతులు, నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు

అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు గిరిజనేతరులకు పొడు పట్టాలు జారీ చేస్తామని మాయ మాటలు చెప్పి

ఇంతవరకు ఏ ఒక్క పోడు రైతుకు పట్టాలు జారీ చేయలేదని, ఎన్నికల సమయంలో గిరిజనులు, పోడు రైతులు గుర్తుకొస్తారని ఎన్నికల అనంతరం ఏ ఒక్కరిని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. 2018 ఎన్నికల సమయంలో ప్రతి పోడు రైతుకు తానే స్వయంగా పట్టాలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పోడు రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే

దక్కుతుందని విమర్శించారు. సుమారు 4.14లక్షల కుటుంబాలు 13లక్షల ఎకరాల పోడు పట్టాల కొరకు దరఖాస్తులు చేసుకోగా డిసెంబర్ నెలలో 11లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వనున్నామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు కేవలం 4లక్షల ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

పోడు పట్టా కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేషారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతి పోడు రైతు కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయించారని అవి తక్షణమే తొలగించాలని అన్నారు. అర్హులైన ప్రతి పోడు రైతుకు పట్టాలు మంజూరు చేయాలని లేదంటే ఉద్యమాన్ని

మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. భారీర్యాలీ అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో కలెక్టర్ ఛాంబర్ కు తాళం వేసి ఉండటంతో ఛాంబరు తలుపుకు పరిస్థితిని వివరించి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించి పోడు సమస్యలు పరిష్కరించమని కోరారు.

Related posts

స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ సినిమా హీరోలు

Satyam NEWS

డీప్ ట్రబుల్: పెరుగుతున్నఅమెరికా ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు

Satyam NEWS

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఎస్ సి కేసు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment