39.2 C
Hyderabad
May 3, 2024 13: 17 PM
Slider ముఖ్యంశాలు

ముగిసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

#MLCElections

తెలంగాణాలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెరపడింది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో మ‌ద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

ఈ మేరకు తెలంగాణ‌ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. 

వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మ‌ళ్లీ ఎల్లుండి సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాతే తెరుచుకుంటాయి. ఈ నెల 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఎన్నిక‌లకు ప్రచారం ముగిసింది.

ఈ రెండు స్థానాల‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈ నెల 17న కూడా మ‌ద్యం దుకాణాల‌ను మూసి వేయాల్సిఉంటుంది.

ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

Related posts

పిల్లలతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

గుండెలు పిండేసిన దళిత బాలిక ఆర్తనాదాలు

Satyam NEWS

వైభవంగా వరంగల్ కళాక్షేత్రంలో బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment