తెలంగాణాలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.
వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మళ్లీ ఎల్లుండి సాయంత్రం 4 గంటల తర్వాతే తెరుచుకుంటాయి. ఈ నెల 14న మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఎన్నికలకు ప్రచారం ముగిసింది.
ఈ రెండు స్థానాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈ నెల 17న కూడా మద్యం దుకాణాలను మూసి వేయాల్సిఉంటుంది.
ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీనిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.