డ్నిప్రో నది వెనుక నుండి తన దళాలను ఉపసంహరించుకోవాలని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు సంబంధిత సైనికాధికారులను ఆదేశించారు. సిబ్బంది, ఆయుధాలు మరియు హార్డ్వేర్లను సురక్షితంగా బదిలీ చేయడానికి ఈ ఆర్డర్ ఇచ్చినట్లు రక్షణ మంత్రిని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది. కైవ్ ప్రాంతం త్వరలో డ్నిప్రో నది ప్రాంతంలో వరదలకు గురి అవుతుందని రష్యా భయపడుతోంది. కఖోవ్కా డ్యామ్పై మరింత శక్తివంతమైన రాకెట్ దాడిని భించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచెత్తవచ్చని కూడా భయపడుతున్నారు. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ ఆచితూచి స్పందించింది. కొన్ని రష్యన్ బలగాలు ఇప్పటికీ ఖేర్సన్లో ఉన్నాయని, అదనపు రష్యన్ సైనికులను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సలహాదారు, ఒలెక్సీ ఎరెస్టోవిచ్ బుధవారం రాత్రి ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియోలో, “వారు బయటకు వెళ్తున్నారు, కానీ అది పూర్తిగా ఉపసంహరించుకోవడం కాదు.” అని చెప్పారు. రష్యా సైన్యం రోడ్లను తవ్వుతున్నట్లు ఎరెస్టోవిచ్ తెలిపారు. వంతెనలను కూడా రష్యా నాశనం చేస్తోంది.
ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత రష్యా స్వాధీనం చేసుకున్న ఏకైక ప్రాంతీయ రాజధాని ఖేర్సన్ నగరం. రష్యా తన దేశంలో విలీనం చేసుకున్న నాలుగు ప్రావిన్సులలో ఖేర్సన్ కూడా ఒకటి.