ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది.
బుధవారం 2,724 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయని, 12 జిల్లాల్లో 29,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 5 కి.మీ దాటిన చోట్ల 2,216 పెద్ద వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.
కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.