తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. గురువారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్, బొత్స సత్యన్నారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి, వరప్రసాద్, బి.మదుసూదన్ రెడ్డి, కె.ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అభ్యర్థి ఎంపికను పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.