40.2 C
Hyderabad
April 28, 2024 16: 14 PM
Slider జాతీయం తెలంగాణ

బీజేపీలో చేరిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ

annapurna

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి బీజేపీ లో చేరారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షడు జేపీ నడ్డా వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకు మునుపే టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు అన్నపూర్ణమ్మ, డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి లు రాజీనామా చేశారు. అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్ రెడ్డి ల చేరిక తో బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్ ల లో పార్టీ బలపడుతుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆన్నపూర్ణమ్మ చేరిక తెలంగాణ బీజేపీ లో మంచి పరిణామం అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా లు దేశం కోసం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు చూసి బీజేపీ లో చేరుతున్నామని అన్నపూర్ణమ్మ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడించారు.

Related posts

గుంటూరు జిల్లాలో చురుకుగా ఎన్నికల ఏర్పాట్లు

Satyam NEWS

సగం కాలిన కరోనా శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Satyam NEWS

150 మంది పోలీసులతో మాజీ సీఎం కు బందోబస్తు…!

Satyam NEWS

Leave a Comment