28.7 C
Hyderabad
May 6, 2024 09: 59 AM
Slider విజయనగరం

కక్ష సాధింపు ధోరణిలోనే వై ఎస్ జగన్ పరిపాలన

#AshokgajapatiRaju

క‌క్ష సాధింపు దోర‌ణిలోనే రాష్ట్రంలో పాల‌న సాగుతోంద‌ని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత పోలిట్ బ్యూరో స‌భ్యుడు అకోశ్ గ‌జప‌తి రాజు మండి ప‌డ్డారు. విజ‌య‌న‌గ‌రం మండ‌లంలో బియ్యాల పేట, సుంకరి పేట, కొండకరకాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండకరకాం సభలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న న‌డుస్తోంద‌న్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలతో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు.

టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజయనగరం నియోజకవర్గ టీడీపీ  ఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18 నెలల పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.త్రాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుచుకునేందుకు గ్రామాల్లోని ప్రజలు అందరూ కలిసికట్టుగా ఏకమై టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, గ్రామ, వార్డు సభ్యులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని  ముఖ్యంగా ఇసుకపాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేత‌లు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కంది మురళినాయుడు, కర్రోతు వెంకట నర్సింగరావు, విజ్జపు ప్రసాద్, కంది శమంతకమణి, తుంపల్లి రమణ, కెంగువ శ్రీను, ప్రసాదుల లక్ష్మీ ప్రసాద్, రొంగలి రామారావు, కొండకరకాం టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి పాండ్రంకి గౌరి, బియ్యాల పేట టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి పడగల అబద్దం, సుంకరి పేట టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి సుంకరి సన్యాసమ్మ లు పాల్గొన్నారు.

Related posts

Shocking News: తెలుగు సినిమా నిర్మాణం బంద్

Satyam NEWS

తిరుమలలో రేపు శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు

Satyam NEWS

మత్స్యకారుల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment