ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వై ఎస్ ఆర్ టి పిని విలీనం చేసి, షర్మిల హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు.