జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడుగా సెలక్ట్ అయిన రామిండ్ల ప్రణయ్ కి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.
దళిత సంక్షేమ జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య సుజాత ఈ డబ్బును ప్రణయ్ కి అందచేశారు. తమిళనాడు లో జరిగే అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ లో పాల్గొనడానికి రామిండ్ల ప్రణయ్ వెళుతున్నాడు.
ఆర్ధికంగా అంతగా స్తోమతు లేకపోవడంతో దారి ఖర్చుల నిమిత్తం ఈ ప్రోత్సాహకాన్ని ఆయన అందించారు.
మంచి ప్రతిభను కనబర్చి ములుగు జిల్లా కు వెంకటాపుర్(రామప్ప) మండలానికి మంచి పేరు తీసుకొని రావాలి అని బొచ్చు సమ్మయ్య సుజాత ఈ సందర్భంగా సూచించారు.
కే.మహేందర్ గౌడ్,సత్యం న్యూస్