కడప జిల్లా నందలూరు ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో శనివారం రాత్రి ఉత్సావాలల్లో భాగంగా యాలి వాహనం పై యోగానరసింహునిగా సౌమ్యనాధ స్వామి మాడ వీధుల్లో ఊరేగారు.
మంగళ వాయిద్యాలు,గోవింద నామాల నడుమ భక్తులు నారికేలం సమర్పించారు.
స్వామివారు పట్టు వస్త్రాలతో, వివిధ పుష్పాలతో, వివిధ నగలతో అలంకార భూషణుడై భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు.భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.