35.2 C
Hyderabad
April 27, 2024 13: 04 PM
Slider వరంగల్

కరోనా బాధిత కుటుంబాలకు సీతక్క సాయం

#mulugu mla

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని ఒడ్డుగుడెం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు.

ఈ రోజు తాడ్వాయి మండలం లోని ఒడ్డు గూడెం గ్రామములో కరోనా తో బాధపడుతున్న కుటుంబాలను ఆమె ఎంతో ఆత్మీయంగా పరామర్శించారు.

హైదరాబాద్ కు చెందిన రుద్ర ఫౌండేషన్, యునైటెడ్ వే ఆఫ్ స్వచ్చంద సంస్థల సహకారంతో 43 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఆమె అందించారు. అంతే కాకుండా బాల వికాస సంస్థ సహకారం తో మెడికల్ కిట్లు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కరోనా తీవ్రత తగ్గింది కావచ్చు కానీ కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని అన్నారు.

ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సీతక్క కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్రెం లచ్చు పటేల్,మాజీ మండల అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ముదర కోళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గణేష ఆగ్రహానికి గురికాక తప్పదు…

Satyam NEWS

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: 43 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ రాజు

Satyam NEWS

బయో డీజిల్ స్టాక్ పాయింట్ ప్రారంభం

Sub Editor

Leave a Comment