న్యూఢిల్లీ లో రెండు రోజుల పాటు జరిగిన 33వ,జాతీయ ఐ ఎన్ టి యు సి ప్లీనరీ సమావేశంలో జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా జాతీయ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడుగా డాక్టర్ జి.సంజీవరెడ్డి ఎంపికైనారు. రెండవసారి జాతియ ఐ ఎన్ టి యు సి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన యరగాని నాగన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు ఐ ఎన్ టి యు సి నాయకులు యరగాని నాగన్న గౌడ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్