పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపిని వివరణ కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ నెంబర్ 203 పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.
రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం బోర్డ్ కు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే కొత్త స్కీం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వివరణ ఇవ్వాలని కె ఆర్ ఎం బీ ఆదేశించింది.