గుంటూరు జిల్లా పెదనందిపాడులో దారుణం జరిగింది. జగన్ పుట్టిన రోజు సందర్భంగా దండిగా తాగిన వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. అక్కడి టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంకటనారాయణ పరిస్థితి విషమం గా ఉండటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బాగా తాగి ఉన్న వైసీపీ కార్యకర్తలు చంద్రబాబునాయుడిని దారుణంగా తిట్టారు. అదేమని అడిగినందుకు వెంకటనారాయణపై దాడిచేశారు. టీడీపీ నేత వెంకటనారాయణకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. తల పగిలిపోయింది. అయినా వదలని వైసీపీ శ్రేణులు వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. అదృష్టం బాగుండి అతను ప్రాణాలతో ఉన్నాడు.