నంద్యాల జిల్లా మహానందిలో వార్త రిపోర్టర్ పై దాడి జరిగింది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలోనే వార్త రిపోర్టర్ మధు పై వైసీపీకి చెందిన గుండాలు దాడి చేశారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒంటెద్దు వీరారెడ్డి, అతని అనుచరులు తుపాకీతో బెదిరిస్తూ దాడికి పాల్పడిన వైనం. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాసాడన్న కోపంతో భౌతికదా డికి దిగారు వీరారెడ్డి అనుచరులు. భౌతిక దాడితో పాటు తుపాకీతో బెదిరించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల జిల్లా జర్నలిస్టుల డిమాండ్ చేస్తున్నారు.
previous post