అవినీతి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు భౌతికదాడులకు దిగారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ నేతలు రాళ్ళ దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనలో నరసరావుపేట టీడీపీ ఇన్-ఛార్జ్ డాచదలవాడ అరవింద బాబు డ్రైవర్ సుబ్బారెడ్డికి తీవ్రగాయాలు తగిలాయి. నరసరావుపేట టీడీపీ ఇన్-ఛార్జ్ డా॥చదలవాడ అరవింద బాబు కారు పై రాళ్ళ దాడి చేయగా ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలు తగిలాయి. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆరోపణలు చేశారు.
previous post