సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ దేవాలయ సమీపంలో సైకిల్ షాప్ నడుపుకుంటున్న బసవోజు నాగాచారి కి ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు చేతుల మీదుగా ట్రై సైకిల్ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు మాట్లాడుతూ గత కొంత కాలంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.గ్రామాలలో, పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రోజు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న,గడ్డం వీరయ్య,అనిల్, నరేష్,నాగేంద్ర బాబు,రమేష్,కృష్ణ నాయక్,సునీల్,మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్