ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపిస్తే.. వైసీపీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూడటం దారుణం అని ఆయన అన్నారు. తమని కాపాడాలని మహిళలు రోదిస్తుంటే.. చావండి అంటూ పైశాచికత్వం ప్రదర్శించడం జగన్ రెడ్డి జంగిల్ రాజ్ కి నిదర్శనం అని లోకేష్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా లోకేష్ షేర్ చేసుకున్నారు. దాయాదులైన మహిళల పట్ల పశువుల కంటే ఘోరంగా ప్రవర్తించిన వైసీపీ నేతలు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడంలేదని ఆయన తెలిపారు.
previous post