రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. రవాణా, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో నగర ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు ఆజ్ఞ లతో ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు…నగరంలో అవేర్నస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్లకు చైతన్యం కార్యక్రమం చేపట్టారు.
నెల రోజుల పాటు నిర్వహించే భద్రతా మాసోత్సవాలలో లైసెన్స్, యూనీఫాం, మీటర్ వేగం ,ఆటో రిజిస్ట్రేషన్ పేపర్లు కచ్చితంగా ఉండాని ఆటో డ్రైవర్లకు చెప్పారు.
అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడవద్దని చెబుతూ తద్వారా ఆటో డ్రైవర్లను ఎస్ఐ భాస్కరరావు చైతన్య పరిచారు.
ఏదైనా విజయనగరం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.