అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్,మంత్రి అంబటి రాంబాబు ల దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగువారు తలదించుకునేలా ప్రవర్తిస్తున్న గోరంట్ల మాధవ్ ను,అంబటి రాంబాబులను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళ,తెలుగు యువత శ్రేణులు పాల్గొన్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు రాజంపేట పార్లమెంటు పదాధికారులు షబానా, అనసూయమ్మ,మిరియాల జ్యోతి,వాణి, టి.యన్.ఎస్. ఎఫ్.వేణు,పట్టణ & రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రమణ్యం నాయుడు,గన్నే సుబ్బ నరసయ్య,ప్రధానకార్యదర్శి అబూబకర్ మండెం, మాజీ అధ్యక్షుడు సంజీవరావు,తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణ,రాంనగర్ నరసింహ, హరీష్,మస్తాన్,జనార్దన్,జడ శివ, ముని బాల తదితరులు పాల్గొన్నారు.