సేవా హై యజ్ఙకుండ్ సమిధా సమ్ హమ్ జలే అన్నచందంగా..అర చేతిలో స్మార్డ్ ఫోన్ లో సర్వస్వం నడుపుతున్న ఈ స్పీడ్ యుగంలో అసలు సేవ చేసేందుకు ఎవ్వరికైనా తీరిక ఉంటుందా…అంటే…ఉంటుంది అని నిరూపించేందుకు సిద్దపడుతోంది…గౌరి సేవాసంఘం వెంకటపద్మ ఫౌండేషన్.
తన తండ్రి జ్ఙాపకార్దం…ఓ సేవా కార్యక్రమం చేయాలనుకున్నారు…. డాక్టర్ వెంకటేశ్వరరావు. అందులో భాగంగానే తన మాతృసంస్త అయిన గౌరి సేవాసంఘం వెంకటపద్మ ఫౌండేషన్, విజయనగరం స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ నెల 17న ఉదయం వెంకటపద్మ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు హాస్పటల్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ,:మేయర్ వెంపడాపు విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ గౌ: కోలగట్ల శ్రావణి లు ప్రారంభిస్తారని తెలిపారు.
స్వచ్చందంగా రక్త దానం చేయాలని.., చేయించాలని…డాక్టర్ వెంకటేశ్వరరావు విలేఖరుల సమక్షంలో ప్రార్ధించారు.ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు,,డాక్టర్ రాజశేఖర్,రామ్మోహన్, ప్రేమసమాజానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఈ మేరకు ఆ నగదును… ప్రేమ సమాజం వైస్ ప్రెసిడెంట్ మద్దాల భాస్కర్ ,కార్యదర్శి పెద్దింటి అప్పారావులకు మేయర్ వెంపడాపు విజయలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు.