38.2 C
Hyderabad
April 29, 2024 21: 03 PM
Slider చిత్తూరు

వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

#BhumanaKarunakarReddy

తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు.

భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.

కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు.

Related posts

చలికాలం మరింత ఉధృతంగా రాబోతున్న కరోనా

Satyam NEWS

డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్ర నేటితో పూర్తి

Satyam NEWS

ఆగస్టు నాటికి దేశంలో పది లక్షల కరోనా మరణాలు

Satyam NEWS

Leave a Comment