వైసీపీ పార్టీ కేవలం రెడ్ల డిఎన్ఏ పార్టీ మాత్రమే అని, దళిత, బహుజన కులాల డిఎన్ఏ అందులో లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతులు బాలకోటయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు వైసీపీ పార్టీకి డిఎన్ఏ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
దళితులు వైసీపీ డిఎన్ఏ అని మీ కెవరు చెప్పారో చెప్పాలి అని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీలు ఏ పార్టీకి సొత్తు కాదని, ఇలాంటి వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచటమే అని అన్నారు. దళిత మంత్రులు పక్కనుండి మౌనంగా ఉండటం సిగ్గు చేటు అన్నారు. ఇలాంటి మాటలను సజ్జల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.