ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల లైన్స్ క్లబ్ గవర్నర్ తీగల మోహనరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లైన్స్ క్లబ్ సమావేశంలో ఇటీవల టిడబ్ల్యూజే, ఐజేయు యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కోలా నాగేశ్వరరావు కు గురువారం సన్మానం చేశారు.
అనంతరం తీగల మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలకు అందించేలా దృష్టి పెట్టాలన్నారు.సమాజంలోని అనేక రుగ్మతులపై పోరాటాలు చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పాత్రికేయులు అండగా ఉండాలని కోరారు.
లైన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని, సమాజంలో జరుగుతున్న రుగ్మతులపై ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ సుందరి నాగయ్య,ఎం శ్రీనివాసరావు, సంజీవరెడ్డి,అధ్యక్షుడు పిన్నాని కోటేశ్వరరావు,సొమగని రాంప్రసాద్,కూన్ రెడ్డి నాగిరెడ్డి,ప్రభావతి,కిత పద్మ,సాము నూరి శ్రీనివాసరాజు,రవీందర్ రెడ్డి, ఉస్మాన్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్