అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఉప్పల్ డీవిజన్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉప్పల్ ఓల్డ్ విలేజ్ శివాలయంలోని శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రజితపరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని తెలిపారు.అనంతరం అన్నప్రసాద వితరణ జరిగినది. కార్యక్రమంలో మేకల శివా రెడ్డి ,గొరిగ కృష్ణ ,తొఫిక్ ,బొంగు రమేష్ గౌడ్ ,తెల్కల మోహన్ రెడ్డి ,చిందం వెంకటేష్ ,కొలు బాలరాజ్ ,ఫణింద్ర ,దేవాలయ కమిటీ సభ్యులు గొరిగ కృష్ణ ,రావుల బాలకృష్ణ ,వేముల వెంకట్ రెడ్డి ,అరటికాయల నందు ముదిరాజ్ ,గొరిగ జంగీర్ ,మంద మురళీకృష్ణ రెడ్డి ,గొరిగ మహేష్ ,ప్రశాంత్ రెడ్డి ,కృష్ణ రెడ్డి ,డబ్బా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి