బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రంను సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ మంగళవారం ప్రారంభించారు. ముందుగా హమాలీ కార్మికులకందరికీ మాస్కులను అందజేసి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రైతులు దూరం పాటించి విత్తనాలను తీసుకురావాలన్నారు.
కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమనితాము సంరక్షించుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అయన తో పాటు సర్పంచ్ శ్రీనివాస్ ఎమ్ పిటిసి సుజాత రాములు సొసైటీ డైరెక్టర్ శివరాజ్ పాటిల్ ఉప సర్పంచి నాగప్ప వార్డు సభ్యులు హనుమానులు గ్రామ పెద్దలు శంకర్ పటేల్ మల్లప్ప శంకర్ పటేల్ సాయిలు గ్రామ రైతులు పాల్గొన్నారు.