28.7 C
Hyderabad
April 27, 2024 05: 46 AM
Slider ప్రత్యేకం

చెకింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ఇద్దరి అరెస్టు

police attack

లాక్ డౌన్ సందర్భంగా వాహనాలను రెగ్యులర్ చెకింగ్ చేస్తుండగా పోలీసులకు చెడు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని మౌలాలి లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక యువకుడు పోలీసులపై తిరగబడ్డాడు.

తల్లి తో కలిసి ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కొట్టాడు. అతడి తల్లి అతడికి బుద్ధి చెప్పడం మాని పోలీసుల కాలర్ పట్టుకుని కొట్టింది. లాఠీ తీసుకుని పోలీసుల్ని కొట్టింది. మహిళ కాబట్టి పోలీసులు ముట్టుకోకుండా ఎంత చెప్పినా వినలేదు. పోలీసు కాలర్ పట్టుకుని వారు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఎలాగోలా బలవంతంగా ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు తో యువకుని పై కేసు నమోదు చేసారు. అందరి ప్రాణాలను కాపాడడానికి 24 గంటలు రోడ్డు ఉద్యోగం చేస్తున్న పోలీసులపై ఇక పై ఎవరైనా దాడికి పాల్పడితే వారి తాట తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

కొత్తపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

Satyam NEWS

భూపాలపల్లి జిల్లాలో చిన్నారిపై అత్యాచారం

Satyam NEWS

శారదా విద్యాలయ వెబ్‌సైట్‌ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment