జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారంప జరిపాడో దుర్మార్గుడు. చిట్యాల మండలం చల్లగరిగా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిన్న రాత్రి 9 ఏళ్ల చిన్నారిపై పొన్నగారి లక్ష్మణ్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపణ వచ్చింది.
ఆ చిన్నారికి సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును సి.సి.ఎస్,టాస్ స్పోర్ట్స్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు.