కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గురువారం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు.
రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్,కొత్త బస్ స్టాండ్ దగ్గర డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు పూలమాలవేసి నివాళులర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి, అనంతరం పేదలకు అల్పాహార విందును అందించారు. రాజంపేట మండలంలోని తాళ్ళపాక పంచాయతీ లో,ఒంటిమిట్ట మండలంలోని మండపం పల్లి పంచాయతీ లో ప్రజల సేవల కోసం నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.