పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామంలో వైసీపీ మద్దతుదారుడు దోరేపల్లి లక్షీనారాయణ విజయం ఖాయంగానే కనిపిస్తుంది.
గత నాలుగు సార్లుగా గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ గా గెలుపొంది దేవులపల్లి గ్రామంలో అనేక అభవృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేశారు.
ఆయన గ్రామానికి చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలులో సుమారు 1600 మీటర్ల C.C రోడ్లు నిర్మాణం, 2500 మీటర్ల గ్రావెల్ రోడ్లు ఏర్పాటు, గ్రామంలో వివిధ ప్రదేశములలో పక్క డ్రైనులు నిర్మాణం,
గ్రామ పంచాయితీ పరిధిలో మంచి నీటి బోర్లు, మోటర్లు ఏర్పాటు, సుమారు 2000 మీటర్ల పైపులైన్ల విస్తరణ పనులు, S.W.M షెడ్డు నిర్మాణము, పలు ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణాలు ఉన్నాయి.
దీంతో గ్రామస్థులు ముక్తకంఠంగా వైసీపీ మద్దతుదారుడు దోరేపల్లి లక్షీనారయణ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.