36.2 C
Hyderabad
May 7, 2024 13: 32 PM
Slider ప్రత్యేకం

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జగన్ మనుషుల దాడులు

#ycpattack

అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు.

గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు.

టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు.

Related posts

ఈవీఎం లపై పూర్తి అవగాహన ఉండాలి

Satyam NEWS

గ్రామ సభల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి

Satyam NEWS

సబ్బండ వర్గాల అభివృద్దే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment