40.2 C
Hyderabad
April 28, 2024 18: 13 PM
Slider ప్రత్యేకం

స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా?

#naralokesh

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన అన్న మాటలు ఇవి:

ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ అనేవాడిని. నీ వికృత‌, క్రూర బుద్ధి చూశాక  సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ జ‌గ‌న్‌రెడ్డి అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్ర‌గ్స్ బిజినెస్ చేస్తారు. నిల‌దీసే టిడిపి నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌తావా? ప‌రిపాలించ‌మ‌ని ప్ర‌జ‌లు అధికారం అందిస్తే… పోలీసుల అండ‌తో మాఫియా సామ్రాజ్యం న‌డుపుతావా? టిడిపి కేంద్ర‌కార్యాల‌యాల‌పై గూండా మూక‌ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ‌తావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం. తెలుగుదేశం స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా?  నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్ట‌డానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రంలేదు. నీ అరాచ‌కాల‌పై ఆగ్ర‌హంగా వున్న కేడ‌ర్‌కి మా లీడ‌ర్ క‌నుసైగ చేస్తే చాలు. నీ కార్యాల‌యాల విధ్వంసం నిమిషం ప‌ని. నీ ఫ్యాన్ రెక్క‌లు మ‌డిచి విరిచి  నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంత‌వ‌ర‌కూ త‌రిమి కొడ‌తారు మా కార్య‌క‌ర్త‌లు. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసి..నీ స‌మాధికి నువ్వే గొయ్యి త‌వ్వుకుంటున్నావు కోడికత్తిగా.

నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Related posts

ఇంటి మార్గం మూత వృద్దాప్యంలో మాజీ పోలీస్ ఇబ్బందులు

Sub Editor

దమ్ముంటే చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

Satyam NEWS

Leave a Comment