కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటన యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయలతోనే ఆత్మకూరు సంఘటన జరిగిందని ఆయన అన్నారు. స్థలం విషయంలో వివాదం ఉండగా చర్చించేందుకు వెళ్లిన బీజేపీ నేతలపై దాడి చేశారని, వాహనాలు తగులబెట్టారని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆయన అన్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ని ఎక్కడ ఉంచారో తెలీదని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా, నిజాయితీగా పోలీసులు పని చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పోలీసులపై నమ్మకం ఉంది…నిజాయితీగా పనిచేసే అవకాశం వారికి కల్పించాలని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వైకాపా పాలనలో లేదని ఆయన అన్నారు. ఆత్మకూరు ఘటనపై హోమ్ మంత్రి ఎందుకు స్పందించలేదు? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కూడా ఆత్మకూరు సంఘటనపై స్పందించాలని ఆయన అన్నారు.
previous post