29.7 C
Hyderabad
May 3, 2024 06: 06 AM
Slider ఖమ్మం

ఏప్రిల్ 12న హైదరాబాద్ లో యుద్ధభేరి

#mrps

ఏప్రిల్ 12న హైదరాబాద్లో జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఎమ్మార్పీఎస్ నాయకులు , మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర జాతీయ నాయకులు గుంటేతీ వీరభద్రం మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది న హైదరాబాద్లో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి మహాసభ కొన్ని కారణాల వల్ల 12వ తారీఖున జరుగుతుందని పేర్కొన్నారు . కావున దళిత సామాజిక వర్గాల ప్రజలు మరియు అని కుల సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు . కావున దళిత ఐక్యతను చాటుకుని , హక్కులను పరిరక్షించుకొని , రాజ్యాంగాన్ని , అంబేద్కర్ భావజాలాలను కాపాడుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఖమ్మం జిల్లా  నాయకులు ముడుసు జాకోబ్ , కామ ప్రభాకర్ , కొట్టే సుధాకర్ , దాసరి శ్రీను , లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రునాయక్ , బెనర్జీ తదితరులు పాల్గొన్నారు .

Related posts

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Satyam NEWS

డెడ్లీ యాక్సిడెంట్: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒకరు మృతి

Satyam NEWS

పవన్ కల్యాణ్ పాటకు సి ఎం రమేష్ స్టెప్స్

Satyam NEWS

Leave a Comment