తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విశేషంగా అభివృద్ధి చెందుతున్నదని నిజామాబాద్ జిల్లా నందిపేట్ జెడ్పీటీసీ యమునా ముత్యం అన్నారు. అందుకోసమే తన వంతు బాధ్యత నిర్వర్తించేందుకు టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.
ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆమెకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన చేస్తున్నందుకు నాయకులు సైతం ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కేసీఆర్ చేస్తున్న పాలన దేశంలోనే చర్చనీయాంశంగా మారిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.