హుజురాబాద్ నియోజకవర్గం లోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు తెరాసలో చేరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. బిజెపి పార్టీ వాళ్ళు దళిత బంధు ఆపాలని కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
అయితే ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బంధు పథకం అమలు ఆగదని ఆయన తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామాన్య కుటుంబాల జీవనం ఎంతో భారంగా మారిందని ఆయన అన్నారు. నిత్యావసర ధరలు,గ్యాస్,చమురు ధరలు ఆకాశాన్నంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీలో చేరినవారిలో ఉపసర్పంచ్ మెట్టుపల్లి సుభాష్,వార్డు మెంబర్లు నాగుర్ల వెంకటేష్,పాత భార్గవ్, దాసరి శ్రీనివాస్, సురావు రాజేష్, ఎండి హకీమ్,మర్రిపెల్లి రాజేష్,సురావు సాంబయ్య,రాజులు,సముద్రాల సాయిలు, శ్రీనివాస్, ఒగ్గోజు మొగిలి, సముద్రాల శ్రీనివాస్,సముద్రాల చంద్రమౌళిలతో పాటు 100 మందికి పైగా చేరారు.