29.7 C
Hyderabad
May 2, 2024 04: 52 AM
Slider ముఖ్యంశాలు

డియస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

#DSR Trust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 14వ,వార్డులో డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యదినోత్సవ సంబరాలను  ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్ఆర్  ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.అనంతరం బాబూరావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు సిద్దించినా ఇంకా దేశంలో కుల వ్యవస్థ కొనసాగుతూనే ఉందని అన్నారు.అందరికీ ఉచిత విద్య అందించే పరిస్థితి కరువైందని,ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.మారుమూల గ్రామ ప్రాంతాలకు ఉచిత వైద్యం ఇంతవరకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భంగా బాబూరావు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మీసాల అంజయ్య, దగ్గుపాటి సుశీల,ఎల్.నాగేశ్వరరావు, కె.కళ్యాణ్,డి.సత్యనందం,సిహెచ్.ప్రసాద్,  అబ్రహం,పి.బాలకృష్ణ,ఎం.రాజేష్,ఎన్. ప్రమోద్ కుమార్,ఎల్.హరి,డి.రాజేష్ ,కె. ఇసాక్,కృష్ణ,ప్రవీణ్,సైదులు,డి.సూర్య రానా,కె.సతీష్,హేమలత,రోజమా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దినసరి భత్యం పెంపుకు ప్రతిపాదనలు

Bhavani

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

Satyam NEWS

పోలీసు బాస్ ఆకస్మిక తనిఖీ.. ఈ సారి ఏ స్టేషన్ అంటే…!

Satyam NEWS

Leave a Comment