మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కాజ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి (శివాలయం) ఏడవ వార్షికోత్సవ ప్రతిష్టామహోత్సవం 14వ తేదీ జరుగుతుందని భక్త బృందం ప్రతినిధి అప్పికట్ల శ్రీహరి నాయుడు తెలిపారు. నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో గురువారం వార్షికోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్పికట్ల శ్రీహరి నాయుడు మాట్లాడుతూ రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన శివాలయంలో ఈనెల 14వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, నవగ్రహ రుద్ర పాశుపత హోమం, 1008 పార్ధివ శివలింగమునకు బిల్వార్చన, అభిషేకం భక్తులే స్వయంగా నిర్వహించుకోవచ్చునని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు అప్పికట్ల కృష్ణమనాయుడు వెల్ఫే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన ర్యక్రమం, రాత్రి ఏడు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున యావన్మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని శ్రీహరి నాయుడు కోరారు. ఈ సమావేశంలో భక్త బృందం ప్రతినిధి ఇంటూరి రాంబాబు పాల్గొన్నారు.
previous post