సావిత్రిబాయి ఫూలే 192వ జయంతిని పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయం SDLCE ప్రాంగణంలోని సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తూరు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలో పాల్గొని నివాళులు అర్పించారు.
అనంతరం రెడ్డికాలనీ లోని న్యూ లయోలా హై స్కూల్ కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతికుమార్ ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలో పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం సావిత్రిబాయి ఫూలే చరిత్ర పై జరిగిన క్విజ్ కాంపిటీషన్ , వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమం లో KU అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ బాబు, గోపా జిల్లా అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్, BSP జిల్లా అధ్యక్షులు శినిగిరపు రాజు, గౌడ సంఘం నాయకురాలు సదాలక్ష్మి గౌడ్, T. సుప్రజ, కార్తీక్, రాజేశ్వర్ రావు, జుకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.